Friday, April 26, 2024

2024 ఎన్నికల్లో రాష్ట్రానికి జనసేన ప్రత్యామ్నాయం : నాదెండ్ల మనోహర్

ఇబ్రహీంపట్నం : 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ నుంచి విముక్తి కోసం జనసేన పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెంలో బుధవారం ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. ఒక పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, యువతకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. దేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ ఒక మహత్కార్యం చేస్తుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. జనసేన పార్టీ బలోపేతానికి జన సైనికులు కృషి చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement