Saturday, April 20, 2024

ప్ర‌పంచంలోనే ఎతైన న‌ట‌రాజ పంచ‌లోహ విగ్ర‌హం-ఆవిష్క‌రించిన త‌మిళిసై

ప్ర‌పంచంలోనే ఎతైన న‌ట‌రాజ పంచ‌లోహ విగ్ర‌హం ఆవిష్కృత‌మైంది.ఈ విగ్ర‌హాన్ని ఒకేసారి పోత‌పోసి త‌యారు చేయ‌డం ప్ర‌త్యేక‌త‌గా నిలిచింది. ఈ విధంగా రూపొందించిన నటరాజ విగ్రహాల్లో ఇదే అత్యంత ఎతైన‌ది. తమిళనాడులో ఈ అద్భుత ఆవిష్కరణ జరిగింది. ఇంతటి విశిష్టమైన నటరాజ విగ్రహాన్ని తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవిష్కరించారు. తమిళనాడు కుంభకోణంలోని లక్ష్మీ నారాయణి పీఠం ట్రస్టీలకు విగ్రహాన్ని లాంఛనంగా అందజేశారు. 23 అడుగుల ఎత్తు, 17 అడుగుల వెడల్పుతో దీన్ని రూపొందించారు. 15 టన్నుల బరువైన ఈ విగ్రహాన్ని.. కుంభకోణంలోని తిమ్మాకుడి గ్రామానికి చెందిన ప్రముఖ శిల్పి వరదరాజ్ తయారు చేశారు. విగ్రహం చుట్టూ 102 పద్మాలు, 52 సింహాలు, 34 సర్పాలను తీర్చిదిద్దారు. సాధారణంగా భారీ విగ్రహాలను.. విడి భాగాలుగా తయారు చేసి తర్వాత కలిపేస్తారు. అయితే, తాజా నటరాజ విగ్రహాన్ని మాత్రం ఒకేసారి పోతపోసి తయారు చేశారు. విగ్రహ ఆవిష్కార కార్యక్రమాల్లో భాగంగా ప్రదోష పూజ నిర్వహించారు. తమిళ సంప్రదాయం ఉట్టిపడేలా శివనందియార్లు యాగాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement