Friday, April 19, 2024

కాంగ్రెస్ కి షాక్ – బిజెపిలో చేర‌నున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు

కాంగ్రెస్ పార్టీకి పూర్వ‌వైభ‌వం తెచ్చేందుకు ఆ పార్టీ కీల‌క నేత రాహుల్ గాంధీ భార‌త్ జోడో పేరిట పాద‌యాత్ర చేస్తుండ‌గా..ఆ పార్టీకి షాక్ త‌గిలింది. గోవాలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో చిక్కుకుంది. ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని గోవా బీజేపీ అధినాయకత్వం వెల్లడించడంతో రాజకీయ కలకలం రేగింది. ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ను కలిసినట్టు సమాచారం. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్న నేపథ్యంలో గోవా అసెంబ్లీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. గోవాలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఇప్పుడు సగం మందికి పైగా బీజేపీలోకి వెళుతుండటం పార్టీకి పెద్ద దెబ్బ‌నే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement