Monday, April 29, 2024

మాన‌వ‌త్వం చాటుకున్న పోలీస్..

నూజివీడు : 25 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి మూర్ఛ వచ్చి పడిపోయాడు. వెంటనే అటుగా వెళుతున్న నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ లో పనిచేయుచున్న పోలీస్ కానిస్టేబుల్ .. దిలీప్ కుమార్ స్థానికుల సహాయంతో అతనికి తక్షణ సహాయం అందించారు. దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లి వైద్య సౌకర్యం కల్పించారు. ఈ సంఘ‌ట‌న నూజివీడు పట్టణంలోని మైలవరం రోడ్డులో చోటు చేసుకుంది. సదరు బాధిత వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దాంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ కానిస్టేబుల్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement