Tuesday, March 26, 2024

ఇంద్రకీలాద్రి: రేపట్నుంచి ఘాట్‌రోడ్‌ ప్రవేశం నిలిపివేత

విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఘాట్‌రోడ్‌ ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఘాట్‌రోడ్డుపై రాళ్లు జారిపడే ప్రాంతాల్లో పనులు జరుగుతున్నందున రానున్న మూడు రోజుల పాటు ఘాట్‌రోడ్‌ ప్రవేశాన్ని మూసేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కొండపైకి వచ్చే వాహనాలకు అర్జున వీధి నుంచి అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement