Friday, April 26, 2024

RTC Bus Fire: మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెనుప్రమాదం

కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం పులవర్తి గూడెం వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. విజయవాడ నుండి గుడివాడ వస్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పులవర్తి గూడెం సమీపంలోకి బస్సు రాగానే ఉన్నట్లు-ండి ఒక్కసారిగా భారీగా మంటలు వచ్చాయి. ప్రమాద సమయంలో సుమారు ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు సాంకేతిక లోకం కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని పలువురు ప్రయాణికులు భావిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement