Tuesday, May 21, 2024

అధికార‌ముంద‌ని ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా జిల్లాల విభ‌జ‌న : బోండా ఉమ‌

అధికారం చేతిలో ఉంది క‌దా అని జగన్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు జిల్లాల విభజన చేస్తోందని టీడీపీ పోలిట్ బ్యూరో స‌భ్యుడు బోండా ఉమ మండిపడ్డారు. తూర్పు తూర్పు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌, పశ్చిమ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద బోండా ఉమ నిరసన దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు రాధారంగ మిత్రమండలి నేత చెన్నుపాటి శ్రీను, కాపు సంఘం నేతలు మద్దతు పలికారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… కొత్త జిల్లాలతో ఉపయోగం ఏంటని ఆయన ప్రశ్నించారు. కొత్త ఉద్యోగం ఒక్కటైనా వస్తుందా అని నిలదీశారు. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త జిల్లాల ఏర్పాటు చేశారన్నారు. జిల్లాల విభజనపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని, సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించకుంటే సీఎం జగన్ నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అన్ని పార్టీలను కలుపుకొని రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఉధృతం చేస్తామని బోండా ఉమా అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement