Sunday, May 5, 2024

AP : చంద్రబాబుపై దాడి.. వెళ్లువెత్తిన నిరసనలు

విజయవాడ, ప్రభ న్యూస్ : పుంగనూరులో చంద్రబాబుపై జరిగిన దాడితో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నగరంలోని పశ్చిమ టీడీపీ పార్టీ కార్యకర్తలు కాళేశ్వరమార్కెట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ నాయకులు ఎమ్ ఎస్ బేగ్ మాట్లాడుతూ… ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్టం ఒక చీకటి రోజుగా చూడాలన్నారు. గతంలో ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. జగన్ మోహన్ రెడ్డి నీచ పాలనకు ఇదే నిదర్శనమన్నారు. 14 సంవత్సరాలు ముఖ్య మంత్రిగా చేసిన చంద్రబాబు మీద మీ గూండాల అరాచకాలు చేపించారన్నారు.

జగన్ మోహన్ రెడ్డి నీకు గూండా రాజకీయం తప్ప అభివృద్ధి పాలనా నీకు చేతకాదన్నారు. చంద్రబాబు వెనక మేమొక కుటుంబ సభ్యులుగా ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టం కొత్త పాలన కోరుకుంటుందన్నారు. బీహార్ పాలన కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్టం వెనుక బడిందన్నారు. ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు.. నీకు గూండా రాజకీయం తప్ప ఇంకా ఏది నీకు చేత కాదన్నారు. త్వరలోనే మీ మంత్రులకు తగిన బుద్ది చెబుతారన్నారు. కేశినేని నాని ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ పార్టీని ముందుకు తీసుకువెళ్తాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement