Friday, May 3, 2024

పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించిన.. ఎస్పీ ‘సిద్ధార్థ కౌశల్’..

మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ , ఏ ఆర్ ఎస్ పి సత్యనారాయణ ఇతర పోలీసు అధికారులతో కలసి పొట్టి శ్రీ రాములు గారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.అనంత‌రం ఎస్పి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు .. నాడు ప్రత్యేక ఆంధ్ర కోసం నిరాహార దీక్షను పూని ప్రత్యేక ఆంధ్ర సాధించడంలో తన ప్రాణాన్ని త్యాగం చేశార‌ని, ఎందరో మహానుభావులు ఆంధ్ర రాష్ట్రం కోసం తమ జీవితాలను త్యాగం చేశారని, ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఇలా స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తిని మనలో నింపుకొని, ప్రజలకు ముందుండి న్యాయం అందించేలా కృషి చేయాలని, స్నేహపూర్వక పోలీసింగ్ ప్రజలకు అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ధర్మేంద్ర , మాసూం భాష , రాజీవ్ కుమార్ ,భరత్ మాతాజీ , మురళీకృష్ణ , రమేష్ , ఉమామహేశ్వర రావు, విజయ్ కుమార్ , ఇన్స్పెక్టర్లు, సీఐలు, ఆర్ ఐ లు ఎస్ఐలు, ఆర్ ఎస్ ఐ లు, కార్యాలయ సిబ్బంది ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement