Monday, May 6, 2024

నూజీవీడులో ఓటు వేసిన ఎమ్మెల్యే మేకా వెంక‌ట ప్ర‌తాప్…

నూజివీడు పట్టణంలో మునిసిపల్ పోలింగ్ ప్రక్రియను నూజివీడు మండల తహసీల్దార్ ఏం. సురేష్ కుమార్ ప‌ర్య‌వేక్షించారు. బంగినపల్లి తోట, బాపునగర్, నెహ్రూనగర్, గొడుగువారిగూడెం, గాంధీనగర్ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నట్లు, ఓటర్లు తమ ఓటును స్వేచ్ఛ గా నిర్భయంగా వినియోగించుకోవాలని తహసిల్దార్ సురేష్ కుమార్ తెలిపారు. ఇక 3 గంట‌ల స‌మ‌యానికి 61.80 శాతం పోలింగ్ నూజివీడులో న‌మోదైంది. కాగా,నూజివీడు ధర్మ అప్పారావు కళాశాల పోలింగ్ బూత్ లో శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement