Sunday, May 5, 2024

నారా లోకేష్ యువగళం పాదయాత్ర – ఉమ్మడి కృష్ణ టీడీపీ నేతల భేటీ

విజయవాడ ప్రభ న్యూస్ – యువగళం పేరుతో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ ను ఉమ్మడి కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కలిశారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ను ఆదివారం తెదేపా సీనియర్ నేతలు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో యువగళం పాదయాత్ర ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈనెల 19వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవేశించనున్న యువగళం పాదయాత్ర రూట్ మ్యాప్ ను ఈ సందర్భంగా రూపొందించారు. పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐదు రోజులపాటు కొనసాగికే విధంగా నేతలు నిర్ణయించినట్లు సమాచారం. ఇదే సందర్భంలో తాజా రాజకీయ పరిస్థితులపై లోకేష్ నాయకులతో పలు అంశాలను చర్చించారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులు తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసిన తీరును ఆయనకు నేతలు వివరించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా పెద్ద ఎత్తున పలు పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు తెదేపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. పాదయాత్రను పూర్తిస్థాయిలో విజయం విజయవంతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించినట్లు లోకేష్ కు నాయకులు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, కృష్ణాజిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకల్ల నారాయణతో పాటు మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు కొల్లు రవీంద్ర, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేసినేని చిన్ని, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, బోడె ప్రసాద్ నియోజకవర్గ ఇన్చార్జులు సీనియర్ నేతలు కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement