Saturday, May 4, 2024

₹.8.5కోట్ల టోకరా – ఐసీఐసీఐ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ పై కేసు నమోదు

నర్సంపేట, ఆగష్టు 13,(ప్రభ న్యూస్):పట్టణ కేంద్రంలోని ఐసీఐసీఐ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ బైరిశెట్టి కార్తిక్ పై పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ రవి కుమార్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకు కు సంబంధించిన ఆడిట్ జరిగే సమయంలో బంగారం నిల్వల్లో వ్యత్యాసాలను గమనించిన రీజనల్ హెడ్ ఓరుగంటి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపిసి 120(బి),493,405,464,468,471,420 మరియు ఐటీ యాక్ట్ 66(సి) మరియు 66(డి) సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.సుమారు128 ఖాతాలను ఉపయోగించినట్లు తెలుస్తుంది.


ఖాతాదారులకు ఇబ్బంది లేదు..సీఐ రవి
బ్యాంకులో జరిగిన ఈ మోసంలో బ్యాంకు ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బందీ లేదని,ఎవరు ఆందోళన పడాల్సిన పని లేదని సీఐ రవి కుమార్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement