Friday, April 26, 2024

Breaking: ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా… కోటంరెడ్డి

తన ఫోన్ ట్యాపింగ్ పై ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు తనతో మాట్లాడారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు చెప్పారు. తన ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి ఫిర్ాయదు చేస్తానన్నారు. ఆ ఆడియో కూడా తనకు పంపారన్నారు. ట్యాపింగ్ కాదు అనుకుంటే మీరే నిరూపించండి అన్నారు. ఎమ్మెల్యేల మీద ట్యాపింగ్ తో ఆగదన్నారు. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, న్యాయమూర్తుల మీద కూడా చేస్తారన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేస్తారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఒక్క ఎమ్మెల్యేతో ఆగిపోదన్నారు. తన ఫోన్ ను దొంగచాటుగా వినలేదని నిరూపించగలరా అని ప్రశ్నించారు. నా జీవితంలో ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తదని అనుకోలేదన్నారు. భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది త్వరలోనే ప్రకటిస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement