Thursday, April 25, 2024

ZP వైస్‌ ఛైర్మ‌న్‌గా కొర్ర‌జ‌న్ని సింహాచ‌లం

విజయనగరం జిల్లా ప‌రిష‌త్ వైస్ ఛైర్మ‌న్‌గా పాచిపెంట జెడ్‌పిటిసి స‌భ్యుడు కొర్ర‌జ‌న్ని సింహాచ‌లం ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. వైస్‌ ఛైర్మ‌న్ ఎన్నిక కోసం జిల్లా ప‌రిష‌త్ ప్ర‌త్యేక స‌మావేశం సోమ‌వారం జ‌రిగింది. ఖాళీ అయిన జెడ్‌పి వైస్ ఛైర్మ‌న్ స్థానంలో, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల‌ మేర‌కు ఎన్నిక నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్, ఎన్నిక‌ల అధికారి శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ప్ర‌క‌టించారు. వైస్ ఛైర్మ‌న్ అభ్య‌ర్థికి ప్ర‌తిపాద‌న‌ల‌ను కోరారు. వైస్ ఛైర్మ‌న్ అభ్య‌ర్థిగా పాచిపెంట జెడ్‌పిటిసి కొర్ర‌జ‌న్ని సింహాచ‌లం పేరును, నెల్లిమ‌ర్ల జెడ్‌పిటిసి గ‌ద‌ల స‌న్యాసినాయుడు ప్ర‌తిపాదించ‌గా, బాడంగి జెడ్‌పిటిసి పెద్దింటి రామారావు బ‌ల‌పరిచారు. మ‌రో ప్ర‌తిపాద‌న రాక‌పోవ‌డంతో, వైస్ ఛైర్మ‌న్‌గా సింహాచ‌లం ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు క‌లెక్ట‌ర్ ప్ర‌క‌టించారు. ఈ స‌మావేశంలో పార్ల‌మెంటు స‌భ్యులు బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, ఎంఎల్‌సి డాక్ట‌ర్ సురేష్‌బాబు, ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భద్ర‌స్వామి, జెడ్‌పి వైస్ ఛైర్మ‌న్ మ‌రిశ‌ర్ల బాపూజీనాయుడు, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, డిప్యుటీ సిఇఓ కె.రామ‌చంద్ర‌రావు, ఇత‌ర జెడ్‌పిటిసి స‌భ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement