Thursday, May 2, 2024

TTD | 19న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.. బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుమల, ప్రభ న్యూస్‌ ప్రతినిధి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 23 నుంచి 2024 జనవరి 1వరకు వైకుంఠద్వార దర్శనాన్ని పురస్కరించుకుని ఈనెల 19న మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా డిసెంబర్‌ 19న బ్రేక్‌ దర్శనాలను టిటిడి రద్దుచేసింది. ఈ కారణంగా డిసెంబర్‌ 18న సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించరు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement