Saturday, May 4, 2024

ఏపీపీసీసీ అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ రెడ్డి ?

ఏపీపీసీసీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీనంగా ఉన్న పార్టీకి ఊపు తీసుకువచ్చే విధంగా ఏం చేయాలని విషయంపైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఏపీలో కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకురావాలనే విషయంపై దృష్టి సారించింది. 2014 ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఏమాత్రం కనిపించకపోవడం, క్యాడర్ చెల్లాచెదురు కావడం, నాయకత్వ లోపం వంటి అన్ని విషయాల పైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలను మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement