Thursday, April 25, 2024

Breaking: కారు చెట్టును ఢీకొని.. ఒక‌రు మృతి, ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు

కారు వేగంగా దూసుకొచ్చి ఓ చెట్టును ఢీకొట్ట‌డంతో ఒక‌రు మృతిచెంద‌గా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డిన ఘ‌ట‌న తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మోర్తాడ్‌ మండలంలోని దోన్కాల్‌ క్రాస్‌ రోడ్డు వద్ద హైవేపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్నవారిలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్ప‌త్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement