Friday, May 3, 2024

తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంలో 11గంట‌ల‌కు వైసీపీ బీసీ మంత్రులు.. నేత‌ల కీల‌క భేటీ

తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంలో నేడు 11గంట‌ల‌కు వైసీపీ బీసీ మంత్రులు..నేత‌లు కీల‌క భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి జగన్ తోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది.కాగా ఈ సమావేశానికి 9 మంది నేతలు హాజరు కానున్నారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, చెల్లుబోయిన వేణు, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే పార్ధ సారధి, అనీల్ కుమార్ యాదవ్, ఎమ్పీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి హాజరు కానున్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీ వర్గాలను కన్సాలిడేట్ చేసుకోవటం, ఈ వర్గాలకు ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళటం, రాష్ట్ర స్థాయి సదస్సులు వంటి అంశాల పై చర్చించనున్నారు నేతలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement