Wednesday, May 15, 2024

రేపే నూతన టీటీడీ చైర్మెన్‌గా.. కరుణాకర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం

తిరుమల, ప్రభన్యూస్‌ ప్రతినిధి : తిరుమల-తిరుపతి దేవస్థానముల పాలకమండలి సోమవారంతో ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నూతన టిటిడి చైర్మెన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమనకరుణాకరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారిచేసింది. దీంతో టిటిడి చైర్మెన్‌గా గురువారం కరుణాకర్‌రెడ్డి తిరుమలకు చేరుకుని ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి టిటిడి చైర్మెన్‌తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కాగా మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పాలకమండలి సభ్యులను కూడా నియమించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement