Tuesday, April 30, 2024

AP : కన్నతండ్రే కాలయముడు….

అభం శుభం తెలియ‌ని పసిబిడ్డను క‌ర్కశ తండ్రి పొట్ట‌న‌పెట్టుకున్నాడు. అల‌న పాల‌న చూడాల్సిన వాడే కాల‌య‌ముడ‌య్యాడు. బుడిబుడి అడుగులు వెసి అల‌రించే చిన్నారి జ్ఞాపిక‌ల‌ను తుడిచేశాడు ఓ క‌సాయి తండ్రి మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తున్న మూడేళ్ల పసిపాప గొంతు కోసి ప్రాణాలు హ‌రించివేశాడు. ఈఘ‌ట‌న క‌ర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే… కర్నూలు జిల్లా కోసిగి మండలం జంబాపురం పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తున్న మూడేళ్ల పసిపాప గొంతు కోసి ప్రాణాలు తీశాడు కసాయి తండ్రి. స్థానికుల సమాచారం మేరకు కోసిగి మండలం జంపాపురం గ్రామానికి చెందిన శాంతా అనే వ్యక్తి నిద్రిస్తున్న తన మూడేళ్ల కుమార్తె చిన్నారిని బ్లేడుతో గొంతు కోశాడు. రక్తపు మడుగులో ఉన్న చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. తల్లి రోదన చూస్తుంటే పలువురు కన్నీరు పర్యంతమయ్యారు. కన్న తండ్రి ఎందుకు ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఎవరికి అంతుపట్టని ప్రశ్నగా మారింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement