Thursday, April 25, 2024

ప్రభుత్వానికే ఇంటర్వెల్ పడుతుంది: మంత్రి పెద్దిరెడ్డికి కన్నా కౌంటర్

మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకోవడాన్ని కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని, ఇంకా శుభంకార్డు పడలేదన్న మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలను ఏపీ బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఏపీకి మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం ఇంకా మూర్ఖత్వానికి పోతున్నట్టుగా కనిపిస్తోందన్నారు. అదే జరిగితే ప్రభుత్వానికి ఇంటర్వెల్ పడుతుందని స్పష్టం చేశారు. ప్రజలే ప్రభుత్వానికి ఇంటర్వెల్ ఇస్తారని హచ్చరించారు. మూడు రాజధానులు నిర్ణయం అహంకారపూరితంగా తీసుకున్నదన్నారు. దీన్ని వెనక్కి తీసుకోక తప్పదని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు.

రాష్ట్ర రాజధాని అంశం ఇష్టం వచ్చినట్టు తీసుకునేది కాదన్న కన్నా.. ఏపీకి రాజధాని ఏదనేది ఎప్పుడో నిర్ణయం జరిగిపోయిందన్నారు. ఎంతో ప్రజాధనాన్ని రాజధానిపై వెచ్చించారని చెప్పారు. 30 వేల మందికి పైగా రైతులు తమ భూములు ఇచ్చారని తెలిపారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని తన ఇష్టం వచ్చినచోట, తననకు నచ్చినచోట పెట్టుకుంటానని ముఖ్యమంత్రి అనడం సబబు కాదని కన్నా మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement