Wednesday, April 24, 2024

భూ స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌లేదంటూ.. త‌హ‌సీల్దార్ పై క‌త్తితో దాడి..

క‌డ‌ప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భూ స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌లేద‌ని ఏకంగా త‌హ‌సీల్దార్ పైనే ఓ వ్య‌క్తి కొత్తితో దాడికి పాల్ప‌డ్డాడు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. పులివెందులలో తహసీల్దార్ కార్యాలయంలోనే కృష్ణమోహన్ అనే వీఆర్ఓపై దస్తగిరి అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. నగిరిగుట్టలోని స్థల వివాదాన్ని ప‌రిష్క‌రించాల‌ని ఎన్నో రోజులుగా ఆఫీస్ చుట్టూ తిరిగినా ప‌నికావ‌డం లేదు. దీంతో ద‌స్త‌గిరి త‌హ‌సీల్దార్ పై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దాడిలో త‌హ‌సీల్దార్ కు గాయాల‌య్యాయి. దీంతో సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని వివ‌రాలు సేక‌రించారు.ఈ మేర‌కు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement