Monday, April 29, 2024

కోదండ రామయ్యను దర్శించుకున్న కలెక్టర్ విజయరామరాజు

ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట కోదండ రామయ్యను జిల్లా కలెక్టర్ విజయరామరాజు దర్శించుకున్నారు. ఈయనకు ఆలయ అధికారులు అర్చకులు రెవెన్యూ సిబ్బంది మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. రామాలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ మండపంలో శాలువా కప్పి సత్కరించారు. తీర్థ ప్రసాదాలు వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు రెడ్డి సిఐ రాజా ప్రభాకర్ ఎస్ ఐ సంజీవ రాయుడు అరేయ్ రమణ విఆర్వో ప్రభాకర్ ఆలయ ఇన్ స్పెక్ట‌ర్ ధనుంజయ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement