Monday, April 29, 2024

మైదుకూరులో హంగ్….

క‌డ‌ప – వైఎస్ జ‌గ‌న్ స్వంత జిల్లాలో క‌డ‌ప కార్పొరేష‌న్ తో అన్ని చోట్ల దూకుడు ప్ర‌ద‌ర్శించిన వైసిపి జోరుకి మైదుకూరులో బ్రేకులు ప‌డ్డాయి… ఈ మునిసిపాలిటీ లో ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్జీ రాలేదు.. 24 వార్డు లు ఉన్న ఈ మునిసిపాలిటీలో వైసిపి 12 చోట్ల విజ‌యం సాధించ‌గా, తెలుగుదేశం 11 చోట్ల గెలిచింది.. మిగిలిన ఒక్క వార్డు జ‌న‌సేన ఖాతాలోకి వెళ్లింది.. దీంతో ఇక్క‌డ హంగ్ ఏర్ప‌డింది.. ఈ మునిసిపాలిటీ పీఠం కైవ‌సంలో ఎక్స్ అఫిషియో ఓట్లు కీల‌కం కానున్నాయి. కాగా హంగ్ దిశ‌గా ఫ‌లితాలు రావ‌డంతో వైసిపి, టిడిపిలు క్యాంప్ రాజ‌కీయాల‌కు తెర‌తీశాయి..గెలిచిన అభ్య‌ర్ధుల‌తో వేరే చోట‌కు త‌ర‌లించారు.. అలాగే జ‌న‌సేన స్థానిక నేత‌ల‌తో టిడిపి నేత‌లు మంత‌నాలు జ‌రుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement