Friday, March 29, 2024

సాహిత్య రత్న అవార్డుకు తాండూరు వాసీ

తాండూరు : తాండూరు మండలం రేచిని గ్రామానికి చెందిన కుప్పరి సత్యనారాయణ సాహిత్యరత్న అవార్డుకు ఎంపికయ్యారు. కుమ్రంభీం ఆసీఫాబాద్‌ జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పీటీజీ బాలుర కళాశాలలో తెలుగు అద్యాపకులుగా పనిచేస్తున్న సత్యనారాయణ ప్రతిష్టాత్మక సాహిత్య నేషనల్‌ అవార్డుకు 2021 సంవత్సరానికి ఎంపికయ్యారు. సాహిత్య రంగంలో విశిష్ఠ సేవలు అందించినందుకు గాను ఆయన ఈ అవార్డు దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో మార్చి 14వ తేదిన జరిగే సౌత్‌ ఇండియా బహుజన రైటర్స్‌ 4వ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఈ అవార్డును సత్యనారాయణను ఆందుకోనున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణను మండలంలోని పలువురితో పాటు రేచిని గ్రామస్థులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement