Friday, May 10, 2024

ఏపీ టూర్‌లో జేపీ న‌డ్డా.. విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రిలో బీజేపీ బ‌హిరంగ స‌భ‌లు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా రేపు, ఎల్లుండి (6,7 తేదీల్లో) ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. రేపు విజయవాడలో, ఎల్లుండి రాజ‌మండ్రిలో జ‌రిగే స‌భ‌ల్లో న‌డ్డా పాల్గొంటారని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. విజయవాడలో రాష్ట్రస్థాయి శక్తి కేంద్ర ఇన్‌చార్జిల‌తో భేటీ కానున్నారు. సాయంత్రం సిటీలో జరిగే మేధావుల సమావేశంలో పాల్గొంటారు. జూన్ 7వ తేదీన‌ రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొన‌నున్న‌ట్టు స‌మాచారం. అదే రోజు వివిధ రంగాల ప్రముఖులతో భేటీ అవుతారు.

ఇక‌.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల విషయమై జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ రెండు రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ త‌రుణంలో బీజేపీ చీఫ్ నడ్డా ఏపీ పర్యటనకు రావ‌డం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలపై బీజేపీ జాతీయ నాయకత్వం సీరియ‌స్‌గానే ఫోక‌స్ చేస్తోంది. అందులో భాగంగా వచ్చే నెలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement