Saturday, May 18, 2024

Save vizag steel plant: పవన్ నిర్ణయంతో మార్పు తథ్యం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ‘ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సభ’కు పవన్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో మాజీ జనసేన నేత, సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు పవన్ కల్యాణ్ సంఘీభావం తెలియజేసినందుకు జేడీ లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్చుకునేలా ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు.


ఇది కూడా చదవండి: Badvel by poll: బీజేపీ పోలింగ్‌ ఏజెంట్లుగా టీడీపీ నేతలు..!
Advertisement

తాజా వార్తలు

Advertisement