Tuesday, May 7, 2024

అంత‌ర్వేది కొత్త‌ ర‌థాన్ని ప్రారంభించిన జ‌గ‌న్…

అమ‌లాపురం – అంతర్వేది నూతన రథాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తాడేప‌ల్లి నుంచి హెలికాప్ట‌ర్ లో నేటి ఉద‌యం అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం అక్కడ నుంచి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు. అక్క‌డ ఆయ‌న‌కు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. స్వామి వారిని దర్శించుకున్న సీఎం.. అనంతరం అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని ఆయన ప్రారంభించారు. నూతన రథం వద్ద ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి.. భక్తులతో కలిసి నూతన రథాన్ని తాడుతో లాగారు. కాగా, 40 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో నూతన రథాన్ని కొత్త హంగులు, రక్షణ ఏర్పాట్లతో నిర్మాణం చేశారు. దీనికోసం 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకును వినియోగించారు.. రికార్డ్ స్థాయిలో 3 నెలల కాలంలోనే నూతన రథాన్ని నిర్మించ‌డం విశేషం..

Advertisement

తాజా వార్తలు

Advertisement