Sunday, April 28, 2024

Janasena – నేటి నుంచి పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర

అన్నవరం -: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో తొలుత తొమ్మిది నియోజకవర్గాల్లో షెడ్యూలు ఖరారైంది. అన్నవరంలో రత్నగిరిపై కొలువైన సత్యదేవుని దర్శించుకుని ఆ తర్వాత ఆయన పర్యటన ప్రారంభించనున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి సెంటర్‌లో తొలి సభ ఏర్పాటు చేశారు. వారాహి వాహనంపై నుంచి ఆయన అక్కడ ప్రసంగించనున్నారు. అనంతరం పిఠాపురం, కాకినాడ గ్రామీణ, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగుతుంది. తొలి పది రోజుల్లో ఏడు బహిరంగసభల్లో పవన్‌కల్యాణ్‌ ప్రసంగిస్తారు.

ఇదీ వారాహి యాత్ర షెడ్యూలు

జూన్‌ 14 కత్తిపూడిలో, 16న పిఠాపురంలో, 18న కాకినాడలో, 20న ముమ్మిడివరంలో, 21న అమలాపురంలో, 22న మలికిపురంలో, 23న నరసాపురంలో వారాహి యాత్ర, తదనంతరం సభను నిర్వహిస్తారు

Advertisement

తాజా వార్తలు

Advertisement