Thursday, May 2, 2024

అమరావతిలోనే జనసేన వ్యవస్థాపక సభ.. 14న భారీ కార్యక్రమం : నాదెండ్ల మనోహర్‌

అమరావతి, ఆంధ్రప్రభ: జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో నిర్వహించనున్నట్లు- ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ- ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. విజయవాడ – చెన్నై 16వ నంబరు జాతీయ రహదారికి కూతవేటు- దూరంలో సభా స్థలిని ఎంపిక చేసినట్లు- వివరించారు. కోవిడ్‌ నిబంధనలు దృష్టిలో పెట్టు-కొని అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గత రెండేళ్లుగా చిన్న స్థాయిలో నిర్వహించారని, ఈ ఏడాది మాత్రం మార్చి 14న బ్రహ్మాండమైన బహిరంగ సభ జరపడానికి ఏర్పాట్లు- చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. ఈ సభా వేదికపై పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించడంతోపాటు-, పార్టీ భావజాలానికి కట్టు-బడి క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేస్తున్న నాయకులు, జనసైనికులు, వీరమహిళలకు పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. శనివారం మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మనోహర్‌ మాట్లాడుతూ.. ‘ఈ నెల 14న ఆవిర్భావ దినోత్సవ సభ ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. సుమారు 7 ఎకరాల ప్రాంగణంలో సభా వేదిక ఉండబోతోంది. వాహనాల పార్కింగ్‌ కోసం మరో 18 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. సభను విజయవంతం చేయడానికి కృష్ణా, గుంటూరుకు చెందిన నాయకులు మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. దూర ప్రాంతాల నుంచి సభకు విచ్చేసే జనసైనికులు, వీరమహిళలు ఇబ్బందులకు గురి కాకుండా మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు- చేస్తున్నారు. మూడు మార్గాల ద్వారా సభా స్థలికి చేరేలా ఏర్పాట్లు- చేస్తున్నార’ని వివరించారు.

ప్రభుత్వం అడ్డంకులు

రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పాలన, నెలకొన్న పరిస్థితుల గురించి ప్రతి ప్రజాస్వామ్యవాది ఆలోచించాలని నాదెండ్ల కోరారు. ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. మంగళగిరిలో ఆవిర్భావ సభ ఏర్పాటు- చేయాలని మూడు వారాల ముందే పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారని, అప్పటి నుంచి సభా స్థలి కోసం అనేక ప్రాంతాలను పరిశీలించామని తెలిపారు. సభ నిర్వహణకు స్థలాలిచ్చేందుకు అంగీకారం తెలిపిన రైతులు.. సాయంత్రానికి రాజకీయ ఒత్తిళ్లతో క్షమించమని చెప్పి వెనక్కి వెళ్లిపోయారని, ఇలా నాలుగు స్థలాలను మార్చాల్సి వచ్చిందని, చివరకు ఇప్పటం గ్రామ రైతులు సామిరెడ్డి, సామ్రాజ్యం, నరసింహం, కొందరు చిన్న చిన్న రైతులు నిండు మనసుతో ముందుకొచ్చి సహకరిస్తామని హామీ ఇచ్చారని వివరించారు. వారికి పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలి
నూతనంగా నియమితులైన డీజీపీని ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలపడంతో పాటు-, సభను గురించి వివరించడానికి జనసేన నాయకులు ప్రయత్నిస్తున్నారని, సభ సజావుగా జరిగేలా పోలీస్‌ శాఖ సహకరించాలని పార్టీ తరపున విన్నవిస్తున్నామని నాదెండ్ల తెలిపారు. ప్రజాస్వామ్యంలో మార్పు కోసం చేసే కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు- చేసుకోకుండా సహకరించాలని కోరుకుంటు-న్నామని, అందుకోసంసలహాలు, సూచనలు అందజేయాలని కోరుతున్నామన్నారు.

పాలనాదక్షత లేని సీఎం జగన్‌
ప్రజలు నిండు మనసుతో 151 సీట్లలో గెలిపిస్తే.. పరిపాలనను గాలికొదిలేసి పాలన దక్షత లేని వ్యక్తిగా ముఖ్యమంత్రి మిగిలిపోయారని మనోహర్‌ విమర్శించారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా సమస్యలు తాండవిస్తున్నాయని, మత్స్యకారుల సమస్యల అధ్యయనానికి ఉభయ గోదావరి జిల్లాల్లో పాదయాత్ర నిర్వహిస్తే.. అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. మత్స్యకార పల్లెల్లో కనీస మౌలిక వసతులు లేవని, అర్హులైన వారికి పెన్షన్లు అందడం లేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం 30 నుంచి 40 శాతం మందికి మాత్రమే అందుతున్నాయని, కనీసం తాగడానికి మంచినీరు లేని దుస్థితిలో తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగారాజధానిపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

జనంలోకి వెళ్లేలా కార్యక్రమాలు
ఆవిర్భావ సభ వేదికగా పవన్‌ కల్యాణ్‌ భవిష్యత్‌ కార్యాచరణ స్వయంగా ప్రకటిస్తారని నాదెండ్ల వివరించారు. పార్టీ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం మీద రూట్‌ మ్యాప్‌ ఇస్తారని, జనసేన పార్టీ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలన్న విషయాన్ని స్పష్టం చేస్తారని తెలిపారు. సమావేశం అనంతరం పలువురు రాజధాని ప్రాంత రైతులు జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి, నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. రాజధానిగా అమరావతి ఉండాలని జనసేన చేసిన పోరాటం విజయాన్ని చేకూర్చిందని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ సభకు వచ్చి, పవన్‌ కల్యాణ్‌ను కలవాలని నాదెండ్ల వారిని ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement