Thursday, May 2, 2024

Jana Sena – నేటి నుంచి పవన్ కల్యాణ్ ఉపవాస దీక్ష – కోనసీమలో వారాహి యాత్ర

కాకినాడ జిల్లాలో జన సేనాని పవన్‌ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర ఏడో రోజుకు చేరింది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు ముస్లిం ప్రతినిధులతో పవన్‌ సమావేశం కానున్నారు..ఇదిలా ఉంటే. ఇవాళ కాకినాడ జిల్లా నుంచి అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు వారాహి యాత్ర ప్రవేశించనుంది. సాయంత్రం 4 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరనున్న పవన్‌. యానాంలో రోడ్‌ షో నిర్వహించనున్నారు.అక్కడి నుంచి ముమ్మిడివరం నియోజకవర్గానికి పవన్‌ చేరుకుంటారు. ఇక. రేపు ముమ్మిడివరం బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు.

మరోవైపు. నేటి నుంచి పవన్‌ కల్యాణ్‌ ఉపవాస దీక్ష చేపట్టారు.. వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైన నేపథ్యంలో పవన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement