Thursday, May 2, 2024

చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష..

కర్నూలు ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షులు వై.నాగేశ్వరరావుకు చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి డి.షర్మిల మంగళవారం తీర్పు చెప్పారు. 2016 నవంబర్ ఇరవై ఆరు తేదీన కర్నూలు వన్ టౌన్ కు చెందిన నాగరాజు వద్ద మూడు లక్షల రూపాయల అప్పు తీసుకొని ప్రామిసరీ నోటు రాయించి ఇచ్చాడు.

అప్పు తీర్చేందుకు 2018 మే 12వ తేదీన మూడు లక్షల రూపాయలకు చెక్కు ఇచ్చాడు. ఫిర్యాదు బ్యాంకులో చెక్కు వేయగా చెక్ చెల్లకపోవడంతో ఫిర్యాది నాగరాజు కోర్టును ఆశ్రయించి కేసు దాఖలు చేశారు. కోర్టు విచారణలో నిందితునిపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement