Thursday, May 16, 2024

రాజ‌శ్యామ‌ల యాగంలో పాల్గొన్న జ‌గ‌న్

విశాఖ‌: పెందుర్తి మండలం చినముషిడివాడలో శారదా పీఠం వార్షికోత్సవంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులను సీఎం జగన్ చేతులతో సత్కారించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవ మూర్తి ఆలయం, దాసాంజనేయస్వామి ఆలయాలను కూడా సందర్శించారు. స్వామీజీలతో కలిసి గోపూజ, శమీవృక్షం ప్రదక్షిణలు చేశారు. రాజశ్యామల యాగంలో కూడా పాల్గొన్నారు. అంత‌కు ముందు పీఠానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే అదీప్ రాజ్ స్వాగతం పలికారు. శారదా పీఠం వార్షిక మహోత్సవాలు పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు జ‌ర‌గ‌నున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement