Saturday, May 11, 2024

పారిశ్రామిక కారిడార్ల ద్వారా రూ.లక్ష కోట్లపైన పెట్టుబడులు : అమర్‌నాథ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: దేశంలో ఎక్కడా లేని విధంగా 3 పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటేనని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌ నాథ్‌ వెల్లడించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌ లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానంలో నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ అధ్యక్షతన అపెక్స్‌ మానిటరింగ్‌ అథారిటీ-సమావేశం గురువారం ఢిల్లీ వేదికగా జరిగింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయం నుంచి పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ డీపీఐఐటీ-, నిక్డిక్ట్‌ నేతృత్వంలో జరిగిన జాతీయ పారిశ్రామిక వాడ అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి అమర్‌ నాథ్‌ మాట్లాడుతూ నేషనల్‌ ఇండస్ట్రియ్రల్‌ కారిడార్స్‌ డెవలప్‌ మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌ఐసీడీసీ) ద్వారా మౌలిక వసతుల కల్పనకు ఏపీ పెద్దపీట వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియ్రల్‌ కారిడార్‌ (సీబీఐసీ), విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియ్రల్‌ కారిడార్‌ (వీసీఐసీ), హైదరాబాద్‌-బెంగళూరు ఇండస్ట్రియ్రల్‌ కారిడార్‌ (హెచ్‌ బీఐసీ) లలో నిక్డిక్ట్‌ నిధుల ద్వారా కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్‌, కొప్పర్తి, శ్రీకాళహస్తి ఏర్పేడు, ఓర్వకల్‌ నోడ్‌ లలో పనులు పారిశ్రామికంగా పరుగులు పెడుతున్నాయన్నారు.

మూడు పారిశ్రామిక వాడలు పూర్తయితే 2040 కల్లా 5,50,000మందికి ఏపీలో ఉద్యోగాలు అందించవచ్చని మంత్రి తెలిపారు. మొత్తం 25వేల ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రంలోని జిల్లాలన్నీ కలుపుతూ ఏర్పాటయ్యే ఇండస్ట్రియ్రల్‌ కారిడార్ల ద్వారా రూ.లక్ష కోట్లకు పైన పెట్టు-బడులు వస్తాయన్నారు. విశాఖపట్నంలో నక్కపల్లి క్లస్టర్‌ , గుట్టపాడు క్లస్టర్లను కూడా పారిశ్రామికంగా తీర్చిదిద్దుతున్నట్లు- పేర్కొన్నారు. మూడు కారిడార్లపై ఎప్పటికప్పుడు ప్రణాళికను సిద్ధం చేసి అనుకున్న సమయానికి నిధులను సేకరించి మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. భూ సమీకరణలు, ప్రాజెక్టుపై పూర్తి నివేదికను తయారు చేయడం, నీటి సరఫరా , విద్యుత్‌ సరఫరా, టె-ండర్ల నిర్వహణ సహా కీలకమైన పనులను సెప్టెంబర్‌, 2022లోగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా నిక్‌ డిక్ట్‌(ఎన్‌ఐసీడీఐటీ-) నిధులు, నేషనల్‌ ఇండస్ట్రియ్రల్‌ కారిడార్‌ డెవలప్‌ మెంట్‌, ఏషియన్‌ డెవలప్‌ మెంట్‌ బ్యాంకు(ఏడీబీ) సహకారం ద్వారా కారిడార్ల అభివృద్ధి మరింత వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాయాన్ని మంత్రి కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement