Thursday, May 2, 2024

Breaking: స్కిల్ కేసులో బాబుకు ఊరట… మధ్యంతర బెయిల్ మంజూరు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. స్కిల్ స్కామ్ కేసులో గత 53 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉంటున్నారు. అయితే చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement