Saturday, May 4, 2024

ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

మంగళగిరి: నగరంలోని పాత మంగళగిరికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు… పాత మంగళగిరికి చెందిన షేక్ జానీ- నాగుల్ మీరా దంపతుల కుమార్తె షేక్ ఆఫ్రిన్ (17) వీజే కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో ఈనెల 3వ తేదీన ఉదయం కళాశాలకు వెళ్లిన ఆఫ్రిన్ తిరిగి ఇంటికి రాలేదు. ఆమె స్నేహితులను, బంధువులను విచారించినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి నాగుల్ మీరా మంగళవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement