Tuesday, April 30, 2024

AP: జ‌గ‌న్ ఇసుక దోపిడిపై విచార‌ణ – ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి ..

రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింద‌ని, . అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. .. ఇసుక దోపిడీ పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింద‌ని , దీనిపై.. ప్రస్తుతం విచారణ జరుగుతోందన్నారు. నెల్లూరులో గురువారం నాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వంపై ప్రజలు ఎంతో అసహనంతో ఉన్నారని తెలిపారు.

కేంద్ర గ్రామీణాభివృద్ధి నిధులను రాష్ట్రం పక్కదారి పట్టించింది అని ఆరోపించారు .. ఈ విషయాన్ని కేంద్రం ప్రభుత్వ కమిటీ పరిశీలించి నివేదిక ఇచ్చింద‌ని అంటూ నిధుల వినియోగంపై యూటిలిజెషన్ సర్టిఫికెట్ అడిగారని తెలిపారు. మరోవైపు, తిరుపతి ఉప ఎన్నికల్లో వై.సి.పి. నేతలు 35 వేల దొంగ ఓట్లను చేర్చించారని.. దీనిపై విచారణ చేసి బాధ్యుల పై చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింద‌న్నారు.. ఎలాంటి అవకతవకలు జరగలేదని రెవెన్యూ.. పోలీస్ అధికారులు నివేదిక ఇచ్చారు.. దీనిపై కూడా విచారణ జరుగుతోందన్నారు.

- Advertisement -

రాష్ట్రంలో లిక్కర్ మాఫియా పేట్రేగిపోతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు పురంధేశ్వరి.. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వేసిన రహదారులు బాగున్నాయ‌ని,. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రహదారులను పట్టించుకోవడం లేదన్నారు. సొంత ఇళ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేస్తోంద‌న్నారు పురంధేశ్వ‌రి.. అందుకే పట్టాను కూడా లబ్ధిదారులు చించేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతుల బీమా ని ప్రభుత్వం చెల్లించలేద‌ని చెప్పారు.. అందుకే రైతులు తీవ్రంగా నష్టపోయార‌న్నారు. .. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయన్నారు. ఎన్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు పెరిగాయ‌ని,. డ్రైవర్ ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబును ముఖ్యమంత్రి పక్కన పెట్టుకుని సమావేశాలు నిర్వహిస్తున్నారని విరుచుకుపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ఎన్నో గట్టి నిర్ణయాలు తీసుకుంటోంద‌ని.. అందుకే 370 ఆర్టికల్ రద్దు.. రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేసిందన్నారు. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు.. ప్యాకేజి బాగుందని కూడా చెప్పార‌న్నారు… అందుకే అప్పుడు వెంకయ్య నాయుడుకు కూడా సన్మానం చేశారని గుర్తుచేశారు పురంధేశ్వరి. కాగా, 22న మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ నెల్లూరుకు వస్తున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement