Friday, April 26, 2024

సెటిలర్స్ వల్లే గిరిజనులకు అన్యాయం.. రాజన్న దొర

సెటిలర్స్ వల్లే గిరిజనులకు అన్యాయం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ… సాలూరు ప్రాంతం సెటిలర్స్ వల్ల నష్టపోతోందని ఆవేదన చెందారు. ఇక్కడ చౌదరి, రెడ్లు ఎక్కువగా సెటిలై ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సెటిలర్స్ వ్యవహారం సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని, సాలూరును షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించాలని కోరుతానని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. గిరిజనుల దగ్గర సంపాదించుకొని అభివృద్ధికి సహకరించడం లేదని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement