Monday, April 29, 2024

AP: అనంతలో అమానుషం.. తల్లిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన తనయుడు

అనంతపురం : కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరులోని ఓబయ్య కాలనీలో అమానుష ఘటన జరిగింది. జన్మనిచ్చిన పాపానికి ఓ కుమారుడు తల్లినే తగులబెట్టేశాడు. కాలనీకి చెందిన సుజాతమ్మ అనే మహిళపై ఆమె కుమారుడు ప్రణీత్ దుర్మార్గానికి ఒడిగట్టాడు. తల్లిపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. దీంతో సుజాతమ్మ కాలి బూడిదైపోయింది. ఈ ఘటనతో కంబదూరు ఉలిక్కిపడింది. పూర్తి వివరాలు పోలీసులు ప్రకటించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement