Saturday, April 27, 2024

India: ఐక్యతా వారధి.. సర్దార్‌ పటేల్‌.. పార్లమెంట్ హాల్ లో ఘనంగా నివాళి

‘‘సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ గొప్ప దేశభక్తుడు, రాజనీతి జ్ఞుడు. దేశ సమగ్రత.. సమైక్యత పట్ల దృఢమైన సంకల్పంకలవాడు. ఆయన దూరదృష్టి, చాతుర్యం దేశాన్ని తొలినాళ్లలో ఏకం చేసింది.. సమైక్యంగా ముందుకు నడిపింది’’.. అని పలువురు ప్రముఖులు యాది చేసుకున్నారు. ఈ రోజు ఆయన 146వ జయంతి సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోపాటు ఎంపీలు శివరాజ్ పాటిల్, మల్లికార్జున్ ఖర్గే, ర‌ఘురామ రాజు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement