Wednesday, May 15, 2024

ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు.. దరఖాస్తుదారులకు వెసులు బాటు

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్దుల వయో పరిమితి పెంపు వెసులు బాటును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 సెప్టెంబర్‌ 27న జారీ చేసిన జీవో 105ను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పొడిగించింది. 2023 సెప్టెంబర్‌ వరకు ఈ మినహాయింపు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏపీపీఎస్సీ సహా మిగతా ప్రభుత్వ నియామక సంస్థలు ఈ అంశాన్ని నోటిఫై చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అటు ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్‌ -1 ఉద్యోగాలకు మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. గతంలో రద్దు చేసిన ఇంటర్వ్యూ విధానాన్ని పునరుద్దరిస్తూ ఉత్తర్వులిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement