Tuesday, May 14, 2024

ప్రారంభ‌మైన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

హైదరాబాద్ లోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే రెండు సార్లు జీఆర్ఎంబీ సమావేశం వాయిదా పడగా… తాజాగా మూడోమారు భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. తెలంగాణ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్‌రావు, ఓఎస్డీ దేశ్​పాండే.. ఆంధ్రప్రదేశ్ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ నారాయణరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. గెజిట్ నోటిఫికేషన్‌ అమలు, బోర్డు నిర్వహణ, ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణకు చెందిన చనాకా-కొరాటా ఆనకట్ట, చౌటుపల్లి హన్మంతురెడ్డి, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకటనగరం పంప్‌హౌస్‌, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల డీపీఆర్‌లపై చర్చిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement