Monday, April 29, 2024

AP : విశాఖ‌లో రౌడీషీట‌ర్లు లేకుండా చేశాం.. డీజీపీ రాజేంద్రనాథ్‌

మంగళగిరి : విశాఖ‌లో రౌడీషీటర్లు లేకుండా చేశామ‌ని, దీంతో విశాఖ ప్రశాంతంగా ఉందని ఏపీ డీజీపీ రాజేంద్ర‌నాథ్ అన్నారు. డీజీపీ రాజేంద్రనాథ్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… విశాఖలో కిడ్నాప్‌ ఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్‌ వివరణ ఇచ్చారు. డబ్బు కోసమే కిడ్నాప్‌ చేశారని స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగానే ఉన్నాయని వెల్లడించారు. ఏపీ క్రైమ్‌రేట్‌ తగ్గిందని స్పష్టం చేశారు. కిడ్నాప్ విషయం విశాఖ ఎంపీ ఫోన్ చేసి అక్కడి సీపీకి సమాచారమిచ్చారన్నారు. ఆడిటర్, ఎంపీ భార్య, కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు సమాచారం వచ్చిందన్నారు. రిషికొండలో బాధితులు ఉన్నట్టు ట్రేస్ చేశామ‌న్నారు. పోలీసులకు సమాచారం వచ్చినట్టు నిందితులకు తెలిసిందని, ఎంపీ కొడుకు, భార్య, మరో వ్యక్తిని తీసుకుని మళ్లీ పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారన్నారు. పద్మనాభపురం వరకూ వెళ్లి అక్కడ బాధితులను వదిలి పారిపోయారన్నారు.

డబ్బు కోసమే ముందుగా ఎంపీ కుమారుడిని కిడ్నాప్‌ చేశారన్నారు. కుమారుడితో ఫోన్‌ చేయించి తల్లిని రప్పించారన్నారు. గంటల వ్యవధితోనే కిడ్నాపర్లను పట్టుకున్నామ‌న్నారు. కిడ్నాపర్లు రూ.కోటి 75లక్షలు తీసుకున్నారన్నారు. ఇప్పటి వరకు రూ.85లక్షలు రికవరీ చేశామ‌న్నారు. కత్తితో చంపేస్తామని కిడ్నాపర్లు బెదిరించారు. నిందితులపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామ‌న్నారు. ఇవాళ నిందితులను కోర్టులో హాజరుపరుస్తామ‌న్నారు. రాష్ట్రంలో క్రైమ్‌ రేటు పెరిగిందనడం సరికాదన్నారు. రాష్ట్రంలో​ శాంతిభద్రతలు పటిష్టంగానే ఉన్నాయన్నారు. రౌడీషీటర్లు లేకుండా విశాఖ ప్రశాంతంగా ఉందని, పోలీసులు అలర్ట్‌గా ఉన్నారు కాబట్టే గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను పట్టుకోగలిగామ‌న్నారు. భూ కబ్జాల కేసులు తక్కువ నమోదవుతున్నాయన్నారు. గంజాయి పంటలను రెండు సంవత్సరాల నుండి ధ్వంసం చేస్తున్నామ‌న్నారు. గంజాయి అమ్మేవాళ్లపై పీడీ యాక్ట్‌లు పెడుతున్నామ‌న్నారు. ఒరిస్సా నుండి గంజాయి వస్తోంది.. మన రాష్ట్రంలో గంజాయి సాగు లేదని డీజీపీ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement