Thursday, May 2, 2024

పారిశుద్ధ్య కార్యాలయం ఆకస్మిక తనిఖీ

ఇచ్చాపురం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల మస్తరు కార్యాలయాన్ని చైర్ పర్సన్ పిలక రాజ లక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం కమీషనర్ ఎన్. రమేష్ తో కలసి కార్యాలయానికి చేరుకున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్  మునిసిపల్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ హాజరయ్యే మస్తర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.  పారిశుద్ధ్య కార్మికుల హాజరును పరిశీలించారు. ఉదయం 5:30 గంటలు నుండి 6 గంటలు వరకు వచ్చిన వారి హాజరు తీసుకొని తరువాత హాజరైన వారిని గైర్హాజరుగా నమోదు చేయించారు. ఈ విధంగా 4 రోజులు ఆలస్యంగా, పూర్తిగా రాని కార్మికుల పేర్లు తొలగిస్తామని చైర్ పర్సన్  హెచ్చరించారు. అనంతరం రత్తకన్న, పురుషోత్తపురం మెయిన్ రోడ్ కు సంబందించి ఎంత మంది వర్కర్స్ వెళ్తున్నారన్నది ఆరా తీశారు. అందరూ తప్పకుండా వారికి కేటాయించిన పనులను ఇచ్చిన సమయంలో పూర్తిచేయాలని సమయానికి మస్తర్ కి హాజరు కావాలని ఆదేశించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement