Thursday, May 2, 2024

పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి

తిరువూరు: పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమివ్వాలని కమిషనర్, వైద్యారోగ్య సిబ్బంది సూచించారు. కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలోని 10 వార్డు స‌హా ప‌లు వార్డుల్లో సచివాలయాల హెల్త్ సెక్రెటరీ లు శుక్రవారం డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. డ్రైనేజీలో మురుగునీరు పారుదల, దోమల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు స్థానికులకు వివరించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని 8వ సచివాలయం హెల్త్ సెక్రెటరీ పీ రమాదేవి తెలిపారు. ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement