Saturday, May 18, 2024

మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త…

క‌ర్నూలు – మద్యం మత్తులో భార్యను భర్త హతమార్చిన ఘటన పగిడాల మండలంలోని ఘనపురంలో చోటు చేసుకుంది. గణపురంకు చెందిన లక్ష్మీదేవి, హుస్సేనయ్య భార్యాభర్తలు. కాగా హుస్సేన్ అయ్యకు మద్యం అలవాటు ఉండటంతో తరచు తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే రాత్రి మద్యం సేవించి వచ్చిన ఉసైనయ్య లక్ష్మీదేవితో గొడవపడ్డాడు. ఆ తర్వాత ఆవేశంలో ఇంట్లో ఉన్న కత్తితో భార్యను పొడిచి చంపాడు. డీఎస్పీ శ్రీనివాస్, ఎస్సై నాగార్జున ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు హుస్సేన‌య్య‌ను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement