Sunday, May 5, 2024

Breaking | సిలిండర్​ లేట్​ అయ్యిందని.. హనుమాన్​ మాలధారుడిపై చెప్పుతో దాడి

ఓ హనుమాన్​ భక్తుడిపై ముస్లిం వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్​ జిల్లా నర్సాపూర్​లో ఇవ్వాల (ఆదివారం) జరిగింది. హనుమాన్ మాల వేసుకున్న లింగం అనే భక్తుడిని కళ్యాణి బిర్యానీ హోటల్ నడిపే ముస్లిం వ్యక్తి చెప్పుతో కొట్టాడు. నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని ఓ కళ్యాణి బిర్యాని హోటల్లో సిలిండర్ ఆర్డర్ చేశాడు యజమాని ఇమ్రాన్. అయితే డెలివరీ బాయ్ అయిన హనుమాన్ మాల వేసుకున్న లింగం చెప్పిన సమయానికి తీసుకురాలేదు. ఈ నేపంతో హనుమాన్ మాల వేసుకున్న లింగంను బూతులు తిట్టాడు. కాస్త లేట్​ అయ్యింది అని చెబుతున్నా.. హోటల్ యజమాని ఇమ్రాన్ కోపగ్రస్తుడై లింగం స్వామిని చెప్పుతో కొట్టాడు.

- Advertisement -

ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు, బీజేపీ శ్రేణులు హనుమాన్ స్వాములు పోలీస్ స్టేషన్ వద్దకు చేరి నిదానాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. స్వామి మాల వేసుకున్న లింగం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కళ్యాణి బిర్యాని హోటల్ యజమాని ఇమ్రాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న హనుమాన్ మాల భక్తులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హిందు వాహిని కార్యకర్తలు, బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, హనుమాన్ స్వాములకు.. హిందూ వాహిని శ్రేణులకు కాస్త తోపులాట కూడా జరిగింది. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు పెద్ద ఎత్తున స్టేషన్​కు చేరుకుని పరిస్థితిని చేయిదాటకుండా చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement