Friday, April 26, 2024

Crime: భార్య, కొడుకుపై కత్తితో భర్త దాడి

మద్యం మత్తులో కట్టుకున్న భార్యను, కన్నకొడుకును కత్తితో భర్త దాడి చేశాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకుంది. అర్ధరాత్రి మద్యం సేవించి ఇంటికొచ్చిన భర్త .. భార్య, కొడుకుతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన భర్త మహబూబ్ బాషా కత్తితో ఇద్దరి కడుపులో పొడిచి పరారయ్యాడు. ఈ దాడిలో కొడుకు యాసిన్‎కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఇద్దరిని ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement