Thursday, May 2, 2024

TTD | శ్రీవారి హుండీకి భారీగా కానుకలు.. జూన్ లో 116 కోట్ల ఆదాయం

తిరుమల శ్రీవారికి గత నెల(జూన్) లో భారీగా ఆదాయం లభించింది. జూన్ నెలలో వెంకటేశ్వరస్వామిని 23 లక్షల మంది భక్తులు దర్శించుకోగా.. స్వామివారికి హుండీ ద్వారా రూ.116.14 కోట్ల ఆదాయం లభించింది. 10.8 లక్షల మంది భక్తులు తలనీలాల మొక్కు తీర్చుకున్నారు. అదే సమయంలో 24.38 లక్షల మంది భక్తులు తిరుమల కొండపై అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు టీటీడీ 1.06 కోట్ల లడ్డూలు విక్రయించింది.

- Advertisement -

కాగా, ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేకుండా క్యూ లైన్లలోకి వచ్చిన భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల వెంకన్నను 87,171 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,273 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.3.68 కోట్ల ఆదాయం లభించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement