Sunday, April 28, 2024

AP: హిందూపురం లోక్ స‌భ బిజెపి అభ్య‌ర్ధిగా స్వామి ప‌రిపూర్ణానంద స్వామి

హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు శ్రీపీఠం వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందూపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా తాను ఖరారు అయినట్లు చెప్పారు. ఇప్పటికే ఎన్నికల ప్రచార ప్రక్రియ మొదలుపెట్టామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన ప్రకటించారు.

- Advertisement -

దక్షిణాదిలో హిందూపురం అనేది చాలా ముఖ్యమైన ప్రాంతమని పరిపూర్ణానంద స్వామి అన్నారు. హిందూపురం అంటే.. హిందూ అని పేరులోనే ఉన్నదని, అందుకే హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని అందుకే ఆ పార్టీ తరపున బరిలోకి దిగనున్నట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement